Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఏపూరి తిరపమ్మ సుధీర్..

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ కి జీవో నెంబర్ 902 ద్వారా నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వము సోమవారం జీవో జారీ చేసింది.ఈ మేరకు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా నడిగూడెం మండల కేంద్రవాసి అయిన ఏపూరి తిరుపమ్మ సుధీర్,వైస్ చైర్మన్ గా షేక్ బషీర్ తో పాటు 16 మంది డైరెక్టర్లతో నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నుండి ఆదేశాలు వెలిబడ్డాయి.ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఏపూరి తిరుపమ్మ సుదీర్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో తమకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా అవకాశం కల్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి,పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా,వ్యవసాయ కుటుంబంలోని వ్యక్తిగా శక్తివంచన లేకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల సహకారంతో కృషి చేస్తానని తెలిపారు.

Related posts

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్ లను తక్షణమే విరమించుకోవాలి: ఎం సాయిబాబా

TNR NEWS

తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి

TNR NEWS

BRS పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి విగ్రహానికి పాలాభిషేకం

TNR NEWS

వరంగల్: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అఘోరి 

TNR NEWS

గుడుంబా ఇస్తావారాలపై పోలీసుల దాడులు… 150 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం,ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం:  ఈస్గాం ఎస్ఐ ‌మహేందర్ఆధ్వర్యంలో..

TNR NEWS

నైతిక విద్యతోనే సమాజాభివృద్ధి

Harish Hs