జిల్లా అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ ఎన్నిక
పిఠాపురం : కాకినాడ జిల్లా నూతన బాక్సింగ్ అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం పిఠాపురం ఆర్.ఆర్.బిహెచ్.ఆర్.ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సర్వ సభ్యుల సమావేశం నిర్వహించారు.
